కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న వేళా సమస్త మానవాళి దాని నుండి కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. మనిషిలో ఉండే రోగనిరోధక శక్తి ఈ సమయంలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తోంది .కారోనకు ప్రస్తుతం వ్యాక్సిన్ కూడా రాని నేపథ్యంలో దానినుండి మనల్ని మనం రక్షించుకునేందుకు రోగనిరోధక శక్తిని పెంపొందేంచుకోవటం ఒకటే మార్గం.
అతి తక్కువ ధరకు మనకు లభించే ఆహార పదార్థం ఉసిరి. ఇండియన్ గుస్ బెర్రీస్ అని పిలిచే వీటిని ఆహారంగా తీసుకోవటం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.
ఉసిరి వలన ఉపయోగాలు
1. ఉసిరిలో క్రోమియం ఉంటుంది. ఇది మన శరీరంలోని కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. కరోనా వైరస్ తన ప్రభావాన్ని గుండె మీద చూపిస్తున్నందున దానిని ఆరోగ్యనగా ఉంచడానికి ఉసిరి ఉపయోగకరం.
2. ఉసిరిని తీసుకోవటం ద్వారా మనకు కావలసిన యాంటిఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి. దీనివల్ల శరీరంలోని రాడికల్స్ న్యూట్రాలైజ్ అవుతాయి .అలాగే ఉసిరి లో ఉండే యాంటి బ్యాక్టీరియల్ పదార్థాలు శరీరంలోని విష పదార్థాలను శుద్ధి చేస్తాయి.
3. ఊబకాయం సమస్యకు కూడా ఉసిరి బాగా పని చేస్తుంది. బరువు తగ్గడానికి తోడ్పడటంతో పాటు బీయమ్ఐ బాగా ఉండటానికి కూడా పనిచేస్తుంది.అటు ఉసిరి లో ఉండే ఫైబర్ వల్ల శరీరానికి మేలు జరగటంతో పాటు జీర్ణ శక్తి బాగా వృద్ధి చెందుతుంది.
4. కరోనా వైరస్ ముక్యంగా దాడి చేసేది శ్వాస వ్యవస్థని. అలాంటి శ్వాస వ్యవస్థను ఉసిరి బలోపేతం చేస్తుంది. ఉసిరిని తీసుకోవటం ద్వారా దగ్గు , జలుబు లాంటి వాటినుండి విముక్తి పొందుతారు.
అంటే పరోక్షంగా ఊపిరితిత్తులకు ఉపశమనం కలుగుతుంది. దీనితో పాటు ఉసిరిలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
5. శరీరంలోని విష పదార్థాల అవశేషాలను తొలగించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడటం లో కాలేయం ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే ఇది ఉత్పత్తి చేసే పైత్యరసం జీర్ణక్రియలో ఎంతో ఉపయోగపడటామ్ తో పాటు ప్రోటీన్లు శరీరానికి అందేలా చేస్తోంది. ఉసిరిని తినటం ద్వారా కాలేయం పనితీరు మెరుగు పడుతుంది.
No comments:
Post a Comment