2015 నుండి ప్రతి సంవత్సరం జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవటం జరుగుతుంది. యోగ అనేది అతి ప్రాచీన భారతీయ కళ. ఇందులో రకరకాల వ్యాయామాలతో పాటు శ్వాస మీద వివిధ వ్యాయామాలు ఉంటాయి. మారుతున్న జీవన విధానం వలన మన ఆరోగ్యం కూడా దెబ్బ తింటూ వస్తుంది. అలా కాకుండా ఆరోగ్యం మీద దృష్టి సరించాలనుకుంటే మాత్రం దానికి యోగ అనేది అద్భుతమైన పరిష్కారం.
రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఎలాంటి ఆసనాలు వేయాలో తెలుసుకుందాం.
1.వృక్షాసనం : ఈ ఆసనం వేయటానికి ముందుగా మీ కాళ్లు చేతులను నిటారుగా ఉంచాలి తరువాత రెండు చేతులను జోడించి తల మీదకు తీసుకురావాలి. ఒక కాలును మరో కాలు మోకాలి వద్దా ఉంచాలి. తరువాత మరో కాలితో కూడా ఇలానే చేయాలి. ఈ సమయంలో బ్యాలెన్స్ అవుట్ కాకుండా జాగ్రత్త పడాలి. ఆసనంం వేసేటప్పుడు కళ్ళు తెరిచి ఉంచండి .
ఉపయోగం: ఒక దగ్గర కూర్చుని పనిచేసే వాళ్లకు ఈ యోగాసనం బాగా ఉపయోగపడుతుంది. చాలా సేపు ఒకే భంగిమలో కూర్చుని ఉండే వాళ్లకు వెన్ను నొప్పి లాంటివి వస్తుంటాయి. అలాంటి వారికి ఈ యోగాసనం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది.
2.త్రికోనసనం : ముందు రెండు కాళ్లను ను సమాంతరంగా ఉంచి నిలబడాలి. తరువాత ఒక చేతిని ఒక కాలి పాదం వైపు , మరో చేయిని ఆకాశం వైపుకు చూపుతున్నట్టు ఎత్తలి.
ఇలా మరో కాలితో చేయితో చేయాలి.
ఇది ఉదయాన్నే చేస్తే మంచి ప్రయోజనం కలుగుతుంది. దీన్ని ఆహారం తీసుకోకుండా ఈ ఆసనం వేయాలి.
ఉపయోగం: శరీరంలో రక్త ప్రసరణను పెంచడంలో ఈ యోగాసనం
ఉపయోగపడటం తో పాటు రక్తపోటును తగ్గిస్తుంది. అలాగే ఉబకాయం పైన కూడా బాగా పని చేస్తుంది.
3.ఉత్క్రాసనం:గాలిలో ఒక కుర్చీ ఉన్నట్టు ఊహించు కొని కూర్చోవడమే ఈ యోగఆసనం. మీరు ఈ భంగిమలో 30 నుండి 60 సెకన్ల పాటు ఉండాలి. చూడటానికి ఇది చాలా సులభం గా అనిపించవచ్చు కానీ వేయడం లో మాత్రం ఇది చాలా కఠినంగా ఉంటుంది. అయితే రోజూ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఎక్కువ సేపు ఈ భంగిమలో కూర్చోవచ్చు .
ఉపయోగం:ఇది గుండెను పరిరక్షించటంతో పాటు ఉదరం లోని అవయవాలకు మేలు చేస్తుంది. ఇది ఊపిరితిత్తులను మరింత ఆరోగ్యంగా మారుస్తుంది.
4.భుజంగాసనం:ఇందులో ముందుగా శరీరాన్ని నేలను తాకేలా ఉంచాలి. తరువాత రెండు చేతులతో తల భాగాన్ని పైకి లేపాలి. కడుపు వరకు ఇలా పైకి లేపి ఉంచాలి. అయితే ఈ ఆసనం వేసేటప్పుడు రెండు చేతులను బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది.
ఉపయోగం:దీనిని కాళీ కడుపుతో ఉన్నప్పుడు చేయాలి. ఒకవేళ ఈ ఆసనం సాయంత్రం పూట వేయాలనుకున్నప్పుడు తిని 4:00 గంటలు గడిచి ఉండాలి. ఈ ఆసనం వల్ల మొత్తం శరీరానికి మేలు జరుగుతుంది. దీనివల్ల మెటబాలిజమ్ వృద్ధి చెందుతుంది. జీర్ణశక్తి మెరుగవుతుంది.
5.శిశు ఆసనం: రెండు మొకల్లా మీద కూర్చొని ముందుకు వంగలి. రెండు కాళ్లు సమాన దూరంలో ఉంచి శరీరాన్ని బ్యాలెన్స్ చేయాలి. గాలి పీలుస్తూ గాలి బయటకు వదులుతూ ఈ ఆసనం వేయాలి.
ఉపయోగం: ఈ ఆసనాన్ని ఖచ్చితంగా తిన్న నాలుగు లేదా ఆరు గంటల తరువాత వేయాలి. ఇది శరీరంలో రక్తప్రసరణను పెంచడంలో ఉపయోగపడుతుంది. ఇది ఆందోళన భయాన్ని తగ్గిస్తుంది. ఒత్తిడి మధ్య జీవితం సాగుతుందని అనిపిస్తే అలాంటి వాళ్లు ఈ ఆసనాన్ని ఖచ్చితంగా వేయటం ద్వారా చాలా లాభపడతారు.
6.పాదంగుస్తాసనం: ఈ ఆసనం లో కాలి వేళ్ళను చేతితో నిటారుగా పట్టుకోవడం ఈ ఆసనం ప్రత్యేకత. ఈ ఆసనం వేయడం కాస్త కష్టంగా ఉంటుంది. కానీ రోజు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ ఆసనం చాలా సులభంగా వేయగలరు. ఈ ఆసనాన్ని ఉదయం పూట ఖాళీ కడుపుతో వేయాలి.
ఉపయోగం:ఇది మనలో ఉండే ఆందోళనను , ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను అందిస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు దీనివలన తగ్గుతాయి .
No comments:
Post a Comment