Tuesday, June 23, 2020

మంచి నిద్రకు చిట్కాలు

మంచి నిద్రకు చిట్కాలు:
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ నిద్ర ప్రతి ఒక్కరికీ చాలా అవసరం. మనిషికి తగినంత నిద్ర ఉండడం ఎన్నో విషయాలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి చక్కగా నిద్రపోవటానికి, ఒత్తిడిని  తగ్గించుకోవటానికి ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
1. ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోకండి: ఆల్కహాల్ తీసుకోవడం ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచి చేయదు. దీని వలన ఒత్తిడి, ఆందోళనలు మరింత పెరుగుతాయి. దీని వలన తక్కువ గా నిద్ర పోతారు. ఫలితంగా రోగనిరోధక శక్తి కూడా దెబ్బతింటుంది.
2. అతిగా కునుకు తీయకండికరోనా కాలంలో మీకు సెల్ఫ్ క్వారంటైన్ లేదా వర్క్ ఫ్రం హోం చేస్తున్నట్లయితే మీరు వేసే కునుకులు కూడా మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. డే టైం లో అతిగా కునుకు తీస్తే రాత్రిపూట నిద్ర కు ఇబ్బందులు తలెత్తుతాయి. దీని వల్ల కొత్త సమస్యలు వస్తాయి.
3. కాస్త వ్యాయామం (నిద్రకు ముందు కాదు) : కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ  జిమ్ లు మూతపడ్డాయి.
కానీ మనలో చాలామందికి  జిమ్ లో వ్యాయామం చేయడం అలవాటు వుంటుంది. అలాంటి వాళ్ళు ఇంట్లోనే వ్యాయామం చేసుకోవచ్చు. వ్యాయామం కూడా మంచి నిద్ర కు కారణం అవుతుంది. అయితే నిద్ర పోవడానికి కొన్ని గంటల ముందు వ్యాయామం చేయడం మంచిది కాదు.
4. సాధారణం గా ఉండండి : చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా మీరు మాత్రం సాధారణంగానే ఉండండి. వర్క్ ఫ్రం హోమ్ చేసిన కానీ రెగ్యులర్గా ఎప్పుడైతే నిద్రలేస్తారో అదే సమయానికి నిద్ర లేవండి. దీనివల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు కలగవు.
అలా కాదని అతిగా నిద్ర పోవడం లాంటివి, పగటిపూట నిద్ర పోవడం లాంటివి చేస్తే మాత్రం లేని ఇబ్బందులు వస్తాయి.

శారీరక ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యమైనది మరియు గుండె సంబంధిత వ్యాధులను రాకుండా అడ్డుకుంటుంది. నిద్రలేమి వలన గుండెకు సంబంధించిన సమస్యలతో పాటు కిడ్నీ వ్యాధులు, అధిక రక్తపోటు, చక్కెర వ్యాధి మరియు గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువలన (సరిగ్గా నిద్రపోండి మరియు చెప్పిన అంశాలను గుర్తుంచుకోండి).

Sunday, June 21, 2020

అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు

అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు
 

2015 నుండి ప్రతి సంవత్సరం జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవటం జరుగుతుంది. యోగ అనేది అతి ప్రాచీన భారతీయ కళ. ఇందులో రకరకాల వ్యాయామాలతో పాటు శ్వాస మీద వివిధ వ్యాయామాలు ఉంటాయి. మారుతున్న జీవన విధానం వలన మన ఆరోగ్యం కూడా దెబ్బ తింటూ వస్తుంది. అలా కాకుండా ఆరోగ్యం మీద దృష్టి సరించాలనుకుంటే మాత్రం దానికి యోగ అనేది అద్భుతమైన పరిష్కారం.
రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఎలాంటి ఆసనాలు వేయాలో తెలుసుకుందాం.
1.వృక్షాసనం : ఈ ఆసనం వేయటానికి ముందుగా మీ కాళ్లు చేతులను నిటారుగా ఉంచాలి తరువాత రెండు చేతులను జోడించి  తల మీదకు తీసుకురావాలి. ఒక కాలును మరో  కాలు మోకాలి వద్దా ఉంచాలి. తరువాత మరో కాలితో కూడా ఇలానే చేయాలి. ఈ సమయంలో బ్యాలెన్స్ అవుట్ కాకుండా జాగ్రత్త పడాలి. ఆసనంం వేసేటప్పుడు  కళ్ళు తెరిచి ఉంచండి .
 ఉపయోగం: ఒక దగ్గర కూర్చుని పనిచేసే వాళ్లకు ఈ యోగాసనం బాగా ఉపయోగపడుతుంది. చాలా సేపు ఒకే భంగిమలో కూర్చుని ఉండే వాళ్లకు వెన్ను నొప్పి లాంటివి వస్తుంటాయి. అలాంటి వారికి ఈ యోగాసనం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది.
2.త్రికోనసనం : ముందు  రెండు కాళ్లను ను సమాంతరంగా ఉంచి నిలబడాలి. తరువాత ఒక చేతిని ఒక కాలి పాదం వైపు , మరో చేయిని ఆకాశం వైపుకు చూపుతున్నట్టు ఎత్తలి.
ఇలా మరో కాలితో  చేయితో చేయాలి.
ఇది ఉదయాన్నే చేస్తే మంచి ప్రయోజనం కలుగుతుంది. దీన్ని ఆహారం  తీసుకోకుండా ఈ ఆసనం వేయాలి.

ఉపయోగం: శరీరంలో రక్త ప్రసరణను పెంచడంలో ఈ యోగాసనం
ఉపయోగపడటం తో పాటు రక్తపోటును తగ్గిస్తుంది. అలాగే  ఉబకాయం పైన కూడా బాగా పని చేస్తుంది.
3.ఉత్క్రాసనం:గాలిలో ఒక కుర్చీ ఉన్నట్టు  ఊహించు కొని కూర్చోవడమే ఈ యోగఆసనం. మీరు ఈ భంగిమలో 30 నుండి 60 సెకన్ల పాటు ఉండాలి. చూడటానికి ఇది చాలా సులభం గా అనిపించవచ్చు కానీ వేయడం లో మాత్రం ఇది  చాలా కఠినంగా ఉంటుంది. అయితే రోజూ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఎక్కువ సేపు  ఈ భంగిమలో కూర్చోవచ్చు .

ఉపయోగం:ఇది గుండెను  పరిరక్షించటంతో పాటు ఉదరం లోని అవయవాలకు మేలు చేస్తుంది. ఇది ఊపిరితిత్తులను మరింత ఆరోగ్యంగా మారుస్తుంది.
4.భుజంగాసనం:ఇందులో ముందుగా శరీరాన్ని నేలను తాకేలా ఉంచాలి. తరువాత రెండు చేతులతో తల భాగాన్ని పైకి లేపాలి. కడుపు వరకు ఇలా పైకి లేపి ఉంచాలి. అయితే ఈ ఆసనం వేసేటప్పుడు రెండు చేతులను బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది.

ఉపయోగం:దీనిని కాళీ కడుపుతో ఉన్నప్పుడు చేయాలి. ఒకవేళ ఈ ఆసనం సాయంత్రం పూట వేయాలనుకున్నప్పుడు తిని 4:00  గంటలు గడిచి ఉండాలి. ఈ ఆసనం వల్ల మొత్తం శరీరానికి మేలు జరుగుతుంది. దీనివల్ల మెటబాలిజమ్ వృద్ధి చెందుతుంది. జీర్ణశక్తి మెరుగవుతుంది.
5.శిశు ఆసనం: రెండు మొకల్లా మీద కూర్చొని ముందుకు వంగలి. రెండు కాళ్లు సమాన దూరంలో ఉంచి శరీరాన్ని బ్యాలెన్స్ చేయాలి. గాలి పీలుస్తూ గాలి బయటకు వదులుతూ ఈ ఆసనం వేయాలి.
ఉపయోగం: ఈ ఆసనాన్ని ఖచ్చితంగా తిన్న నాలుగు లేదా ఆరు  గంటల తరువాత వేయాలి. ఇది శరీరంలో రక్తప్రసరణను పెంచడంలో ఉపయోగపడుతుంది. ఇది ఆందోళన భయాన్ని తగ్గిస్తుంది. ఒత్తిడి మధ్య జీవితం సాగుతుందని అనిపిస్తే అలాంటి వాళ్లు ఈ ఆసనాన్ని ఖచ్చితంగా వేయటం ద్వారా చాలా లాభపడతారు.
6.పాదంగుస్తాసనం: ఈ ఆసనం లో కాలి వేళ్ళను చేతితో నిటారుగా పట్టుకోవడం ఈ ఆసనం ప్రత్యేకత. ఈ ఆసనం వేయడం కాస్త కష్టంగా ఉంటుంది. కానీ రోజు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ ఆసనం చాలా సులభంగా వేయగలరు. ఈ ఆసనాన్ని ఉదయం పూట ఖాళీ కడుపుతో వేయాలి.

ఉపయోగం:ఇది మనలో ఉండే ఆందోళనను , ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను అందిస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు దీనివలన తగ్గుతాయి .

Monday, June 15, 2020

జలుబు తగ్గాలంటే ఏం చేయాలి?

జలుబు తగ్గాలంటే ఏం చేయాలి?

1. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో లేదా పాలలో చిటికెడు పసుపు కలుపుకొని తాగితే ఉపశమనం లభిస్తుంది.
2. గుప్పెడు తులసి ఆకులు,చిటికెడు ఉప్పు కలిపిన మిశ్రమాన్ని నమిలి మింగాలి.
3. రెండు కప్పుల నీటిలో ఒక అల్లం ముక్క,ఒక దాల్చినచెక్క వేసి బాగా మరిగించాలి. ఆ తరువాత ఆ నీటిని బాగా వడకట్టి దానికి కొద్దిగా తేనె కలిపి తాగాలి.
4. కొన్ని నల్లమిరియాలు నమిలి మింగాలి.

కివీ తో ఉపయోగాలు

నేటి ఆరోగ్య చిట్కా:
కివీ తో ఉపయోగాలు:
1.రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
2.కంటిచూపుని మెరుగుపరుస్తుంది.
3.విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది.
4.జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
5.చర్మ , కాలేయ క్యాన్సర్లను అడ్డుకుంటుంది.
6.రక్తపోటును నియంత్రిస్తుంది.
7.రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది.
8.ఫైబర్ అధికంగా లభిస్తుంది.

Friday, June 12, 2020

రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ఉసిరి పాత్ర:

రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ఉసిరి పాత్ర:
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న వేళా సమస్త మానవాళి దాని నుండి కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. మనిషిలో ఉండే రోగనిరోధక శక్తి ఈ సమయంలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తోంది .కారోనకు ప్రస్తుతం వ్యాక్సిన్ కూడా రాని నేపథ్యంలో దానినుండి మనల్ని మనం రక్షించుకునేందుకు రోగనిరోధక శక్తిని పెంపొందేంచుకోవటం ఒకటే మార్గం.
అతి తక్కువ ధరకు మనకు లభించే ఆహార పదార్థం ఉసిరి. ఇండియన్ గుస్ బెర్రీస్ అని పిలిచే వీటిని ఆహారంగా తీసుకోవటం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.
ఉసిరి వలన ఉపయోగాలు
1. ఉసిరిలో క్రోమియం ఉంటుంది. ఇది మన శరీరంలోని కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. కరోనా వైరస్ తన ప్రభావాన్ని గుండె మీద చూపిస్తున్నందున దానిని ఆరోగ్యనగా ఉంచడానికి ఉసిరి ఉపయోగకరం.
2. ఉసిరిని తీసుకోవటం ద్వారా మనకు కావలసిన యాంటిఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి. దీనివల్ల శరీరంలోని రాడికల్స్ న్యూట్రాలైజ్ అవుతాయి .అలాగే ఉసిరి లో ఉండే యాంటి బ్యాక్టీరియల్ పదార్థాలు శరీరంలోని విష పదార్థాలను శుద్ధి చేస్తాయి.
3. ఊబకాయం సమస్యకు కూడా ఉసిరి బాగా పని చేస్తుంది. బరువు తగ్గడానికి తోడ్పడటంతో పాటు బీయమ్ఐ బాగా ఉండటానికి కూడా పనిచేస్తుంది.అటు ఉసిరి లో ఉండే ఫైబర్ వల్ల  శరీరానికి మేలు జరగటంతో పాటు జీర్ణ శక్తి బాగా వృద్ధి చెందుతుంది.
4. కరోనా వైరస్ ముక్యంగా దాడి చేసేది శ్వాస వ్యవస్థని. అలాంటి శ్వాస వ్యవస్థను ఉసిరి  బలోపేతం చేస్తుంది. ఉసిరిని తీసుకోవటం ద్వారా దగ్గు , జలుబు లాంటి వాటినుండి విముక్తి పొందుతారు.
అంటే పరోక్షంగా ఊపిరితిత్తులకు ఉపశమనం కలుగుతుంది. దీనితో పాటు ఉసిరిలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
5. శరీరంలోని విష పదార్థాల అవశేషాలను తొలగించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడటం లో కాలేయం ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే ఇది ఉత్పత్తి చేసే పైత్యరసం జీర్ణక్రియలో ఎంతో ఉపయోగపడటామ్ తో పాటు ప్రోటీన్లు శరీరానికి అందేలా చేస్తోంది. ఉసిరిని తినటం ద్వారా కాలేయం పనితీరు మెరుగు పడుతుంది. 

నేటి ఆరోగ్య చిట్కా

నేటి ఆరోగ్య చిట్కా:
1. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కొద్దిగా పసుపు కొంచెం నిమ్మరసం కలిపి రోజు రెండుపూటలా తాగితే జలుబు, దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది.

2.  ప్రతి రోజు నీళ్లలో  తులసి ఆకులు కలుపుకుని త్రాగితే గొంతు ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.

నేటి ఆరోగ్య సూత్రాలు

నేటి ఆరోగ్య సూత్రాలు:
             కోడిగుడ్లు

గుడ్లలో క్యాలరీలు చాలా తక్కువ వీటిని క్రమం తప్పకుండా తీసుకోవటం వలన ఎక్కువగా కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి, కండరాలకు బలం చేకూరుతాయి.
             పాలకూర
పాలకూరతో ప్రయోజనాలు:
1. కంటిచూపుని మెరుగుపరుస్తుంది.
2.ఏసిడిటి ని తగ్గిస్తుంది.
3.రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
4.జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
5.గ్యాస్ట్రిక్, అల్సర్లను నివారిస్తుంది.
6.అధిక బరువును తగ్గిస్తుంది.
7.ఎముకలను పటిష్ఠంగా చేస్తుంది.
8.రక్తహీనత సమస్యను నివారిస్తుంది.
9.చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.


Thursday, June 11, 2020

రోగనిరోధక శక్తిని పెంచుకుందాం కరోనా వైరస్ ను అడ్డుకుందాం.



దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న దశలో మహమ్మారిని ఎదుర్కోవడానికి స్వీయ జాగ్రత్తలతోపాటు, రోగ నిరోధకశక్తిని పెంపొందించుకోవడమూ ముఖ్యమే. అందుకే ‘సరైన ఆహారం తినండి..కొవిడ్‌ను ఎదుర్కోండి’ .



ద్రవ పదార్థాలు
తినేద్దాం.. కరోనాను తరిమేద్దాం!

తగినంత నీరు శరీరంలో ఉంటే విషతుల్యాలను శరీరం నుండి బయటకు పంపించడం సులభమవుతుంది. ముక్కు, శ్వాస నాళాల్లో జిగురు పదార్థం నిలకడగా ఉండి, వైరస్‌ను లోనికి వెళ్లకుండా అడ్డుకుంటుంది.
తీసుకోవాల్సినవితాగునీరు, కొబ్బరినీళ్లు, నిమ్మరసం, గ్రీన్‌ టీ, హెర్బల్‌ టీ, సూప్‌లు, పాలు, మజ్జిగ, తీపి, ఉప్పు లేని ద్రావణాలు, పండ్లు, కూరగాయలు.


ప్రొటీన్లు
తినేద్దాం.. కరోనాను తరిమేద్దాం!

ఇవి మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తాయి.
తీసుకోవాల్సినవిసోయా ఉత్పత్తులు, ఉప్పు కలపని గింజలు, విత్తనాలు, బీన్స్‌, పప్పు దినుసులు, గుడ్లు, చికెన్‌, మటన్‌, చేప, పాలు, పాల ఉత్పత్తులు.


ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్
తినేద్దాం.. కరోనాను తరిమేద్దాం!

రోగ నిరోధక కణాల పనితీరును మెరుగుపరుస్తాయి
తీసుకోవాల్సినవివాల్‌నట్స్‌, గుమ్మడి, పుచ్చ, పొద్దుతిరుగుడు విత్తనాలు, చేపలు.


విటమిన్‌ ఎ
తినేద్దాం.. కరోనాను తరిమేద్దాం!

నోరు, జీర్ణాశయం, ప్రేగులు, శ్వాసకోశ వ్యవస్థలోని చర్మాన్ని, కణజాలాన్ని రక్షిస్తుంది.
తీసుకోవాల్సినవి: చిలగడదుంప(స్వీట్‌ పొటాటో), క్యారట్‌, మామిడి, బొప్పాయి, గుడ్లు, పాలకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలు, పాలు, పాల ఉత్పత్తులు.


విటమిన్‌ డి
తినేద్దాం.. కరోనాను తరిమేద్దాం!

హానికారక అతి సూక్ష్మక్రిముల సంహారానికి, శరీరానికి మేలు చేసే సూక్ష్మక్రిముల వృద్ధికి దోహదపడుతుంది.
తీసుకోవాల్సినవిపాలు, పాల ఉత్పత్తులు. ఉదయం వేళల్లో శరీరంలోని 18 శాతం భాగాన్ని సూర్యరశ్మి స్పృశించేలా చూసుకోవడం. కొవ్వున్న చేపలు, గుడ్లు, మాంసంలో కాలేయం.


విటమిన్‌ ఇ
తినేద్దాం.. కరోనాను తరిమేద్దాం!

యాంటీ ఆక్సిడెంటుగా పనిచేస్తుంది. ముఖ్యంగా వృద్ధుల్లో రోగ నిరోధకతను పెంపొందించడంలో దోహదం చేస్తుంది.
తీసుకోవాల్సినవిపొద్దు తిరుగుడు, కుసుంభ,  అవిసె గింజలు, బాదం, పిస్తా.


విటమిన్‌ బి6
తినేద్దాం.. కరోనాను తరిమేద్దాం!

జీర్ణకోశ రోగ నిరోధకతను క్రమబద్ధీకరిస్తుంది. విషపూరిత చర్యల్ని తగ్గిస్తుంది.
తీసుకోవాల్సినవిసోయాబీన్‌, పప్పులు, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్నలు, అల్లం, వెల్లుల్లి,  పచ్చిమిర్చి, అరటి, మునగ, మెంతి ఆకులు, కరివేపాకు, ఉప్పుడు రవ్వ.


విటమిన్‌ బి12
తినేద్దాం.. కరోనాను తరిమేద్దాం!

రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
తీసుకోవాల్సినవిచేపలు, మాంసం, చికెన్‌, గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు.


విటమిన్‌ సి
తినేద్దాం.. కరోనాను తరిమేద్దాం!

యాంటీబాడీస్‌ను ప్రేరేపిస్తుంది. కణాల పనితీరును మెరుగుపరుస్తుంది.
తీసుకోవాల్సినవిఆకుపచ్చని కూరగాయలు, జామ, దానిమ్మ, ఉసిరి, ద్రాక్ష తదితర పుల్లని పండ్లు, బొప్పాయి, స్ట్రాబెర్రీ, క్యాప్సికమ్‌, నిమ్మ.


ఖనిజ లవణాలు (మినరల్స్‌)
తినేద్దాం.. కరోనాను తరిమేద్దాం!

జింకు, క్యాల్షియం, మెగ్నీషియం వంటివి వైరస్‌ ఇన్‌ఫెక్షన్లను తగ్గించడంలో ఉపయోగపడతాయి.
తీసుకోవాల్సినవిఅన్ని రకాల గింజ ధాన్యాలు, పప్పు దినుసులు, సోయాబీన్‌, పుచ్చకాయ విత్తనాలు, గుమ్మడికాయ విత్తనాలు, చికెన్‌, గుడ్లు, వాల్‌నట్స్‌, పొద్దుతిరుగుడు విత్తనాలు, చేపలు.

మంచి ఆరోగ్యం కోసం ఎలాంటి పద్ధతులను అనుసరించాలి?

మంచి ఆరోగ్యం కోసం ఎలాంటి పద్ధతులను అనుసరించాలి?



  1. కాచి వడబోసి  చల్లార్చిన నీటిని మాత్రమే త్రాగాలి.
  2. తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. మాంసాహారాన్ని, శాఖాహారాన్ని రెండింటినీ సమపాళ్ళల్లో తీసుకోవాలి.
  3. బత్తాయి, నారింజ, కమలా పండ్ల వంటివి తినేటప్పుడు పిప్పి ఊసేయకుండా తినటం మంచిది. వీలయినంత వరకు కాయగూరల పైన తొక్కు తీయకుండా వండుకోవాలి.
  4. వేసవి కాలంలో మంచినీళ్ళు ఎక్కువగా తీసుకోవాలి. మంచినీటి పాత్రలోకి నేరుగా గ్లాసులను ముంచకుండా పాత్ర క్రింద భాగాన కుళాయి ఏర్పాటు చేసుకుంటే మంచిది. శుభ్రంగా ఉంటుంది.
  5. ఆహార పదార్థాల పైన ఈగలు, క్రిమికీటకాలు వాలకుండా చూసుకోవాలి.
  6.  కాయగూరలను పండ్లను నీళ్ళతో కడిగిన తర్వాతనే ఆహారంగా తీసుకోవాలి.
  7. నిద్రలేమితో బాధపడుతున్న వారు పడుకునే ముందు కొత్తిమీర రసం, పంచదార కలిపిన నీళ్ళను తాగితే ఫలితం ఉంటుంది.
  8. రక్తంలోని కొలెస్టల్ ను తగ్గించుకొని సన్నబడాలంటే పెరుగును ప్రతి రోజూ ఎక్కువగా తీసుకోవాలి.
  9. రాత్రి పడుకోబోయేటప్పుడు ఒక గ్లాసు మంచి నీటిలో ఒక తులం పటిక బెల్లం వేసి వుంచి ఆ నీటిని ఉదయం లేవగానే తాగాలి. పది హేను రోజుల పాటు ఇలా చేస్తే పార్శ్వనొప్పి తగ్గుతుంది.
  10. చిటికెడు పసుపు గ్లాసు పాలలో కాచి, రోజూ ఉదయాన్నే తాగుతుంటే జలుబు, దగ్గు, ఆయాసం తగ్గుతుంది.
  11. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ తగ్గాలంటే రోజుకు రెండుసార్లు కప్పు పాలల్లో ఒక వెల్లుల్లి రేకు ముక్కలుగా చేసి  బాగా మరగనిచ్చి వెల్లుల్లి ముక్కలను తీసి, ఆ పాలు తాగితే మంచి గుణం కన్పిస్తుంది.
  12. దగ్గు, ఆయాసంతో బాధపడేవారు అల్లం రసం 1 స్పూన్, దానిమ్మరసం 1 స్పూన్, తేనె 1 స్పూన్ ఈ మూడూ కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటే దగ్గు, ఆయాసం బాగా తగ్గుతాయి.
  13. చిన్నపిల్లలు మలబద్దకంతో బాధపడుతుంటే రోజూ రెండు స్పూన్లు ద్రాక్షరసం ఇస్తూ ఉంటే మలబద్దకం పోతుంది,
  14. అజీర్ణం, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు తోటకూర, క్యారెట్, నారింజ నాలను సమంగా కలిపి ఆ మిశ్రమాన్ని రోజుకు మూడుసార్లు తీసుకోవాలి.
  15. మూత్ర విసర్జనలో బాధగా లేదా మంటగా ఉంటే క్యాబేజీని మాత్రం అసలు తినకూడదు.

Wednesday, June 10, 2020

చేపలు తినటం వలన కలిగే లాభాలు ఏమిటి ?

చేపలు తినటం వలన కలిగే లాభాలు ఏమిటి ? 

1. గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.
2. కీళ్లనొప్పులను తగ్గిస్తుంది.
3. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
4. కంటిచూపు మెరుగు పడుతుంది.
5. అనేక రకాల క్యాన్సర్లను రాకుండా అడ్డుకుంటుంది.
6.రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది.
7. ఎముకలు దృడంగా మారతాయి.
8.విటమిన్ ఎ, డి, కె,ఈ లభిస్తాయి.

రోగనిరోధక శక్తి పెరగాలంటే ఏం చేయాలి?


రోగనిరోధక శక్తి పెరగాలంటే ఏం చేయాలి?


 
1. ఒక రోజు ముందు రాత్రి నానబెట్టిన బాదంను
మరుసటిరోజు ఉదయం పూట తినాలి.
2. జామకాయ , బత్తాయి , కమలంపండు , నిమ్మకాయ లేదా నిమ్మపండు , క్యాప్సికమ్ వంటి వాటిని తీసుకోవటం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది మరియు రోజంతా ఎంతో ఉషారుగా ఉంటారు.
3.మనం రోజూ తీసుకునే ఆహారంలో ఆకుకూరలు(పాలకూర, తోటకూర) , అల్లం మరియు మునగాకు ఉండేలా చూసుకోండి.
4.రోజువారి ఆహారంలో పసుపు ను ఎక్కువగా వాడాలి.

Tuesday, June 9, 2020

బీట్ రూట్ వలన ప్రయోజనాలు

బీట్ రూట్ జ్యూస్



సమ్మర్‌లో బీట్ రూట్ జ్యూస్ తాగుతున్నారా... ఈ అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం...

 బరువు తగ్గడానికీ, లివర్ ను కాపాడేందుకు ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాల కోసం ఇప్పుడు డాక్టర్లు సూచిస్తున్న జ్యూస్ బీట్ రూట్ జ్యూస్.


మనం పెద్దగా పట్టించుకోం గానీ బీట్ రూట్ జ్యూస్‌ తో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మీకు తెలుసా... మద్యం తాగడం వల్ల పాడైపోయే లివర్‌ను కాపాడేందుకు బీట్ రూట్ జ్యూస్ ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. ఎలాగంటే ఈ జ్యూస్ మన శరీరంలో విష వ్యర్థాల్ని తరిమికొట్టే యాంటీఆక్సిడెంట్స్ (Antioxidants) కలిగివుంది. అంతే కాదు... విటమిన్ A, విటమిన్ B6, ఐరన్ వంటివి ఈ జ్యూస్‌లో పుష్కలంగా ఉన్నాయి. అందుకే సూపర్ ఫూడ్‌గా పిలిచే వాటిలో బీట్ రూట్ జ్యూస్‌ని కూడా చేర్చారు. మీకు తెలుసో, తెలీదో గానీ మన శరీరంలో లివర్ దాదాపు 700 రకాల పనులు చేసి పెడుతుంది. మన శరీరంలోకి ప్రవేశించే విష వ్యర్థాల్ని బయటకు పంపిస్తుంది. అందుకే లివర్ చక్కగా పనిచెయ్యాలంటే దానికి బీట్ రూట్ జ్యూస్ ఇవ్వాలన్నమాట. బీట్ రూట్ జ్యూస్ లివర్ లో మంటను తగ్గిస్తుంది. శక్తిని కలిగిస్తుంది.


బీట్ రూట్ జ్యూస్ తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు


బీట్ రూట్ జ్యూస్‌లో ప్రోటీన్లు (మాంసకృత్తులు), కార్బోహైడ్రేట్స్ (పిండి పదార్థాలు), ఫైబర్ (పీచు), ఫొలేట్, విటమిన్ సీ, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, జింక్ వంటివి ఉన్నాయి. మన శరీరానికీ, చర్మానికీ, రక్తానికీ, వ్యాధి నిరోధక శక్తికీ అన్నింటికీ ఎంతో మేలు చేస్తుంది బీట్ రూట్ జ్యూస్.


1.రక్త హీనత తగ్గిస్తుంది : మన శరీరానికి రక్తం చాలా అవసరం కదా. రక్తాన్ని కృత్రిమంగా తయారుచెయ్యలేకపోతున్నారు. అందుకే రక్తదానానికి అంత ప్రాధాన్యం ఇస్తున్నారు. మరి అలాంటి రక్తాన్ని మనం కాపాడుకోవాలి. బీట్ రూట్ జ్యూస్ లోని ఐరన్... మన శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతుంది. రక్త హీనత, అనీమియా వంటి సమస్యలు దూరమవుతాయి. ఐరన్ లోపం నుంచీ బయటపడొచ్చు.

2. బీపీని తగ్గిస్తుంది : బ్లడ్ ప్రెషర్ (బీపీ)ని తగ్గించే సామర్ధ్యం బీట్ రూట్ జ్యూస్‌కి ఉంది. ఇందులోని రకరకాల పోషకాలు, ఫైబర్ బీపీని కంట్రోల్ చేస్తాయి. ఈ జ్యూస్ తాగితే 100 శాతం ఫైటోన్యూ్ట్రియంట్స్ (ఫైటో పోషకాలు) బాడీకి అందుతాయి. ఇవి బీపీ ఎంత ఉండాలో అంతే ఉండేలా చేస్తుంటాయి.

3. చర్మానికి రక్షణ : తీవ్రమైన ఎండ, ఇతరత్ర కాలుష్యాల నుంచీ చర్మాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరం. బీట్ రూట్ జ్యూస్ లోపలి నుంచీ చర్మాన్ని కాపాడుతుంది. చర్మంలోకి వచ్చే ఫ్రీ రాడికల్స్ చర్మ కణాల్ని నాశనం చేస్తుంటాయి. సరిగ్గా అలాంటప్పుడు ఈ జ్యూస్ ఎంటరై... ఫ్రీ రాడికల్స్ అంతు చూస్తుంది. ఈ జ్యూస్‌లో లైకోపీన్ ఉంటుంది. అది సూర్యుడి తీవ్రమైన ఎండల నుంచీ మన చర్మాన్ని కాపాడుతుంది.

4.లైంగిక సామర్ధ్యాన్ని పెంచుతుంది : ఇప్పుడంటే వయాగ్రా పేరుతో చాలా ఐటెమ్స్, మందులూ వచ్చాయి గానీ... పూర్వం పిల్లలు పుట్టని వారికి బీట్ రూట్ తినమని సలహా ఇచ్చేవాళ్లు పెద్దలు. కారణం బీట్ రూట్‌లో బోరాన్ అనే ఖనిజం ఉంటుంది. అలాగే బీట్ రూట్ జ్యూస్ మన శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచుతుంది. బోరాన్, నైట్రిక్ ఆక్సైడ్ రెండూ కూడా సెక్స్ హార్మోన్లను ఉత్తేజ పరుస్తాయి. ఫలితంగా ఆరోగ్యకరమైన సెక్స్ సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు ఈ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుందని ఎన్నో పరిశోధనల్లో తేలింది.

5.అథ్లెటిక్ పెర్ఫార్మెన్స్ పెంచుతుంది : బరువు తగ్గాలి, బాగా ఎక్సర్ సైజ్‌లు చెయ్యాలనుకునేవారు... వారానికి నాలుగు సార్లైనా బీట్ రూట్ జ్యూస్ తాగేయాలి. ఎందుకంటే ఇందులో నైట్రేట్లు, బెటాలైన్స్ మన శరీరంలో రక్త ప్రవాహాన్ని పెంచుతాయి. కండరాల్లో ఆక్సిజన్ సరఫరా మెరుగవుతుంది. ఫలితంగ మన బాడీ చురుగ్గా తయారై, ఎక్సర్ సైజ్ చెయ్యడానికీ, అథ్లెట్లలా దూసుకుపోయేందుకూ వీలవుతుంది. అదే సమయంలో ఈ జ్యూస్ ఎంత తాగినా బరువు పెరగరు కాబట్టి... ఇది చాలా మేలు చేస్తుంది.

బీట్ రూట్ ని మన ఇళ్లలో వంటల్లో కూడా వాడుతారు. ఐతే, ఇలా వండితే, వాటిలో పోషకాలు తగ్గిపోయి, ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా కలగవు. అందుకే ఆరోగ్య నిపుణులు బీట్ రూట్ జ్యూస్ ని తాగమని సూచిస్తున్నారు.

Monday, June 8, 2020

పల్లిలు బెల్లం కలిపి తినటం వలన మన శరీరంలో జరిగే మార్పులు ఏమిటీ?

1. రోజు తింటే రక్తం శుద్ధి అవుతుంది.
2. రక్తహీనత సమస్య తీరేందుకు బాగా సహాయ పడుతుంది.
3. రక్త సరఫరా బాగా పెరిగి గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది.
4. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
5. ఏదుగుతున్న పిల్లలకు పల్లిలు బెల్లం కలిపి ఇస్తే రోజంతా ఉషారుగా ఉంటారు.
6. చర్మం తాజాగా మారుతుంది, మచ్చలు తొలిగిపోతాయి.

నేటి ఆరోగ్య చిట్కా

పండు పేరు : పూపెడిపండు ( పాపయ)
డయాబెటిస్ ఉన్న వారికి ఇది చాలా ఉపయోగకరమైన పండు, దీనిని అధిక స్థాయిలోరక్తం లో చక్కెర ఉండే వాళ్ళు కచ్చితంగా తినాలి, ఇది రక్తం లో చక్కెర స్థయిని తగ్గిస్తుంది.

బ్రకోలీ వలన ఉపయోగాలు ఏమిటి

బ్రకోలీ వలన ఉపయోగాలు ఏమిటి? 1.  ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది, ఇది జీర్ణక్రియకు  ఉపయోగపడుతుంది . 2. మెటబాలిజం (జీవక్రియ) ను నియంత్రిస్తుంది. 3...